‘టీడీపీ ఎమ్మెల్యే మోసం చేశారు’ | women allegations on tdp MLA appalanaidu | Sakshi
Sakshi News home page

‘టీడీపీ ఎమ్మెల్యే మోసం చేశారు’

Dec 29 2015 9:26 AM | Updated on Aug 10 2018 8:16 PM

‘టీడీపీ ఎమ్మెల్యే మోసం చేశారు’ - Sakshi

‘టీడీపీ ఎమ్మెల్యే మోసం చేశారు’

గజపతినగరం ఎమ్మెల్యే కె. అప్పలనాయుడు తనను మోసం చేశారంటూ శ్రీకాకుళానికి చెందిన ఎన్.ఛాయాకుమారి అనే మహిళ సోమవారం జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్‌కు ఫిర్యాదు చేశారు.

శ్రీకాకుళం : గజపతినగరం ఎమ్మెల్యే కె. అప్పలనాయుడు తనను మోసం చేశారంటూ శ్రీకాకుళానికి చెందిన ఎన్.ఛాయాకుమారి అనే మహిళ సోమవారం జిల్లా ఎస్పీ ఎ.ఎస్.ఖాన్‌కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం గుజ రాతీపేటకు చెందిన ఛాయాకుమారికి కారాసు దీప అనే మహిళతో పరిచయం ఉంది. రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే కొద్దిరోజుల వ్యవధిలో రూ.50 లక్షల వరకు లాభం వస్తుందని, ఇరీడియం రైస్‌పుల్లింగ్ కాయిన్ పేరిట ఓ ప్రాజెక్టు చేపట్టామని, ఇందులో టీడీపీ ఎమ్మెల్యే అప్పల నాయుడు కూడా భాగస్వామిగా ఉన్నారని దీప చెప్పడంతో గతేడాది నవంబర్‌లో రెండు విడతలుగా తాను డబ్బు చెల్లించానని ఛాయా తెలిపారు.
 
ఎమ్మెల్యే ఒత్తిళ్ల మేరకే డబ్బు చెల్లించానని, బ్యాంకు వివరాలు కూడా ఎమ్మెల్యే ఇచ్చారని తెలిపారు.   డబ్బుల కోసం ప్రశ్నిస్తుంటే తనను ఢిల్లీ, విజయవాడ, విశాఖ ప్రాంతాలకు తిప్పి చివరకు శ్రీనివాస్ అనే ఎమ్మెల్యే బినామీ తనకు రూ.60 వేలు ఇచ్చి పంపించారన్నారు. ఘటనపై విచారిస్తామని ఎస్పీ చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement