తిరుపతిలో మాన్య డెంటల్ క్లినిక్లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది.
తిరుపతి: తిరుపతిలోని దొడ్డాపురంలో మాన్య డెంటల్ క్లినిక్లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతురాలిని డెంటల్ క్లినిక్లో పనిచేసే సంధ్యగా గుర్తించారు.
పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. డాక్టర్ను ఆస్పత్రి సిబ్బందిని విచారిస్తున్నారు. ఈ కేసులో సంధ్య ప్రియుడికి సంబంధముందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అతనికి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.