టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నేడు (ఏప్రిల్ 29) వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. కావ్య రెడ్డి అనే యువతితోకలిసి తిరుమలలో ఏడు అడుగులు వెయ్యబోతున్నాడు. బుధవారం రాత్రి 11: 13 గంటలకు సాయి శ్రీనివాస్- కావ్యల పెళ్లి శ్రీవారి సాక్షిగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది. సినీ ప్రముఖుల కోసం మే 1న హైదరాబాద్లో భారీ ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్కు చెందిన కావ్యను ప్రేమించి శ్రీనివాస్ పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసింది. కొంతకాలంగా వారు ప్రేమలో ఉన్నామని రెండు కుటుంబాలకు తెలిపి ఒక్కటి కానున్నారు. కావ్య తండ్రి, తాత న్యాయ రంగ ప్రముఖలని తెలుస్తోంది.
బెల్లంకొండ కుటుంబం సాయి శ్రీనివాస్ పెళ్లి ఘనంగా నిర్వహించనుంది. తమ కుటుంబ దైవం సమక్షంలో పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. అందుకోసం ఇప్పటికే శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.


