భర్తను కడతేర్చిన భార్య | wife killed her husband | Sakshi
Sakshi News home page

భర్తను కడతేర్చిన భార్య

Mar 24 2017 11:04 PM | Updated on Sep 5 2017 6:59 AM

భర్తను కడతేర్చిన భార్య

భర్తను కడతేర్చిన భార్య

యల్లనూరు మండలం పెద్దమల్లేపల్లిలో పెద్దిరెడ్డి(45)ను అతని భార్య అర్ధరాత్రి రోకలిబండతో కొట్టి చంపింది.

యల్లనూరు : యల్లనూరు మండలం పెద్దమల్లేపల్లిలో పెద్దిరెడ్డి(45)ను అతని భార్య అర్ధరాత్రి రోకలిబండతో కొట్టి చంపింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి వివాహం వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురం మండలం కడపనాగయ్యపల్లికి చెందిన నాగేశ్వరమ్మతో పాతికేళ్ల కిందట అయింది. వారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కొన్నేళ్లుగా వ్యసనాలకు బానిసైన భర్త పెద్దిరెడ్డి పూటుగా మద్యం తాగొచ్చి డబ్బుల కోసం భార్యతో గొడవపెట్టుకునేవాడు. అంతటితో ఆగక కొన్ని సందర్భాల్లో ఆమెపై భౌతికంగా కూడా దాడి చేసేవాడు. మరికొన్ని సందర్భాల్లో తనకు తాగేందుకు డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లోని వస్తువులను పెద్దిరెడ్డి అమ్మేసేవాడు.

ఆత్మరక్షణ కోసం...
గురువారం అర్ధరాత్రి దాటాక మద్యం మత్తులో ఉన్న పెద్దిరెడ్డి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అతని బారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు రోకలితో తలపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన పెద్దిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గొడవ జరుగుతున్న సమయంలో అరుపులు, కేకలు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి పోలీసులు
శుక్రవారం ఉదయానికల్లా ఈ సమాచారం అందరికీ తెలిసిపోయింది. సీఐ సురేంద్రనాథరెడ్డి, ఎస్‌ఐ హరినాథరెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement