ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య | vip gongidi sunitha visits nalgonda district | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య

Jun 27 2016 4:28 PM | Updated on Sep 4 2017 3:33 AM

ప్రభుత్వ కళాశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తెలిపారు.

యాదాద్రి: ప్రభుత్వ కళాశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తెలిపారు. సోమవారం ఆమె నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో రూ.2.50 కోట్లతో నిర్మించతలపెట్టిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి, రూ.6 కోట్లతో నిర్మించే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలబాలికల హాస్టళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే బాలబాలికలకు మధ్యాహ్నభోజనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కూడా ఉందని విప్ చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement