బైక్ దగ్ధం చేసిన ఆగంతకులు | Unknown persons fired bike with petrol in Guntur district | Sakshi
Sakshi News home page

బైక్ దగ్ధం చేసిన ఆగంతకులు

Sep 2 2015 10:19 AM | Updated on Aug 25 2018 4:51 PM

ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనంపై ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు.

గుంటూరు : ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనంపై ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ వీధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న వెంకట్‌రెడ్డి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంటికి చేరిన వెంకట్రెడ్డి బైక్ను ఇంటి ముందు పార్క్ చేశాడు.  అయితే ఈ రోజు ఉదయం లేచి చూసేసరికి బైక్ కాలి బూడిద అయింది. దీంతో వెంకట్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement