మినీ వ్యాన్ బీభత్సం: ఇద్దరు మృతి | Two killed in road accident in east godavari district | Sakshi
Sakshi News home page

మినీ వ్యాన్ బీభత్సం: ఇద్దరు మృతి

Aug 3 2016 9:35 AM | Updated on Aug 30 2018 4:07 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని ధవళేశ్వరం రోడ్డులో బుధవారం మినీ వ్యాన్ బీభత్సం సృష్టించింది.

రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని ధవళేశ్వరం రోడ్డులో బుధవారం మినీ వ్యాన్ బీభత్సం సృష్టించింది. రహదారిపై వెళ్తున్న ఆటో, బైక్ను మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మినీ వ్యాన్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement