పిడుగుపాటుకు ఇద్దరి మృతి: 15 మందికి గాయాలు | Two died and 15 injured due to thunderstorm | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ఇద్దరి మృతి: 15 మందికి గాయాలు

Jun 1 2016 6:20 PM | Updated on Sep 4 2017 1:25 AM

మానకొండూరులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. చెరువుకట్టపై ఉన్న ప్రజలపై అకస్మాత్తుగా పిడుగుపడింది.

మానకొండూరు (కరీంనగర్ జిల్లా) : మానకొండూరులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. చెరువుకట్టపై ఉన్న ప్రజలపై అకస్మాత్తుగా పిడుగుపడింది. ఈ ఘటనలో గాయపడినవారిని 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మృతులు శంకరపట్నానికి చెందిన కవిత, సదాశివపల్లికి చెందిన లక్ష్మి(50)గా గుర్తించారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement