రాజవొమ్మంగి (రంపచోడవరం) : రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ కాలనీకు చెందిన నేశం శిరీష (22) అనే గిరిజన యువతి మలేరియా జ్వరం, కామెర్లతో ఏలేశ్వరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించింది. ఆమెకు ఏడాది కిందటే వివాహం జరగ్గా అమ్మగారి ఊరైన అమీనాబాద్ వచ్చి జ్వరం బారిన పడింది. దీంతో కుటుంబీకులు ఆమెను రెండు రోజుల కిందట ఏలేశ్వరం తరలించారు.
అక్కడ ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిరీష పరిస్థితి విషమించి చివరికి మరణించింది. రెండు రోజుల కిందట అమీనాబాద్కాలనీకే చెందిన రావుల రాంబాబు (40) అనే గిరిజనుడు ఏలేశ్వరం ప్రయివేటు ఆసుపత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొంది, చనిపోయిన విషయం పాఠకులకు తెలిసిందే. అమీనాబాద్కాలనీకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో గల జడ్డంగి పీహెచ్సీకి వెళ్ళకుండా గిరిజనులు వైద్యం కోసం ఏలేశ్వరంలోని ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించడం గమనార్హం. జడ్డంగి పీహెచ్సీలో సరైన వైద్యం అందక, క్షేత్రస్థాయి మలేరియా, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అధికారులు పనితీరు సంతృప్తికరంగా లేకే ఇక్కడి గిరిజనులు ప్రయివేటు ఆసుపత్రులకు వెళుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
రోగనిర్ధారణలో జాప్యంతో చేటు..
కేవలం జ్వరంతో మూడు రోజుల పాటు బాధపడుతూ గిరిజనులు చనిపోవడానికి అసలు వారికి వచ్చిన రోగం ఏమిటన్నది త్వరగా నిర్ధారణ కాకపోవడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డెంగీ వంటి రోగాల బారిన పడి సకాలంలో సరైన వైద్యం లభించకే గిరిజనుల్లో మరణాలు సంభవిస్తున్నాయా అన్న కోణంలో సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉంది. రోగంతో ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్ళి ఫీజుల రూపేణా వేలకు వేలు చెల్లించలేని స్థితిలో చికిత్సకు నోచుకోక కూడా ఈ విధంగా అర్ధాంతరంగా చనిపోతున్నారా అన్న అంశాన్ని కూడా ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.
మలేరియాతో గిరిజన యువతి మృతి
Published Sun, Aug 20 2017 10:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
కన్నీటి సుడులు.. కరిగె మారాజు
ఎవరినీ వదిలిపెట్టను
గంటల్లోనే పరిహారం
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement