అనంతపురం సెంట్రల్: నగరంలో హౌసింగ్బోర్డు కాలనీలో నివాసముంటున్న ట్రాన్స్కో చిరుద్యోగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. ట్రాన్స్కోలో పోల్ టూ పోల్ ఆపరేటర్గా పని చేస్తున్న సుధాకర్(35) ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతకాలం నుంచి సుధాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
ట్రాన్స్కో ఉద్యోగి ఆత్మహత్య
Mar 6 2017 12:39 AM | Updated on Nov 6 2018 7:53 PM
అనంతపురం సెంట్రల్: నగరంలో హౌసింగ్బోర్డు కాలనీలో నివాసముంటున్న ట్రాన్స్కో చిరుద్యోగి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. ట్రాన్స్కోలో పోల్ టూ పోల్ ఆపరేటర్గా పని చేస్తున్న సుధాకర్(35) ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతకాలం నుంచి సుధాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం భారీగా డబ్బులు ఖర్చు పెట్టడంతో అప్పులపాలయ్యాడు. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. వన్టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement