గురువారం నుంచి 4వ తేదీ వరకు 4రైళ్లు దారిమళ్లించి నడుపుతున్నట్లు ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్ పరశురామ్ బుధవారం విలేకరులకు తెలిపారు.
నేటి నుంచి రైళ్ల దారి మళ్లింపు
Feb 1 2017 10:13 PM | Updated on Sep 5 2017 2:39 AM
ఆదోని అగ్రికల్చర్: గురువారం నుంచి 4వ తేదీ వరకు 4రైళ్లు దారిమళ్లించి నడుపుతున్నట్లు ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్ పరశురామ్ బుధవారం విలేకరులకు తెలిపారు. వాడి, రాయచూరు ప్రాంతాల్లో డబుల్ లైన్ పనులు జరుగుతుండడం వల్ల పూణె నుంచి రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు. ట్రైన్ నం.16381 ముంబయి–కన్యాకుమారి రెండు రోజులు, నం.11013 కుర్ల ఎక్స్ప్రెస్ మూడు రోజులు, నం.12164 చెన్నై ఎక్స్ప్రెస్ రెండు రోజులు, నం.16382 కన్యాకుమారి–ముంబయి ట్రైన్లు పూణె నుంచి మేరేజ్, బళ్లారి, గుంతకల్ మీదుగా నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
Advertisement
Advertisement