రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య | Train collapsing youth suicide | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

Sep 20 2016 10:42 PM | Updated on Nov 9 2018 4:31 PM

కడప రైల్వేస్టేషన్‌ పరిధిలోని కడప–కృష్ణాపురం రైలు మార్గంలో కిలోమీటరు నెంబరు 261/5–6 మధ్య కొండేటి మహేంద్రనాయుడు (19) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

కడప అర్బన్‌: కడప రైల్వేస్టేషన్‌ పరిధిలోని కడప–కృష్ణాపురం రైలు మార్గంలో కిలోమీటరు నెంబరు 261/5–6 మధ్య కొండేటి మహేంద్రనాయుడు (19) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలం పాటిమానిపల్లెకు చెందిన మహేంద్రనాయుడు చిత్తూరు జిల్లా కలకడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియేట్‌ చదువుతున్నాడు. అతని ఛాతిపైన లక్ష్మి అనే పచ్చబొట్టు ఉంది. అతను ఈ మార్గంలోకి ఎందుకు వచ్చాడు.. ఇక్కడ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే  కారణాలు తెలియరాలేదు. అతని వద్ద లభించిన ఆధారాలను బట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ నాగరాజు నాయక్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement