కడప రైల్వేస్టేషన్ పరిధిలోని కడప–కృష్ణాపురం రైలు మార్గంలో కిలోమీటరు నెంబరు 261/5–6 మధ్య కొండేటి మహేంద్రనాయుడు (19) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
కడప అర్బన్: కడప రైల్వేస్టేషన్ పరిధిలోని కడప–కృష్ణాపురం రైలు మార్గంలో కిలోమీటరు నెంబరు 261/5–6 మధ్య కొండేటి మహేంద్రనాయుడు (19) అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలం పాటిమానిపల్లెకు చెందిన మహేంద్రనాయుడు చిత్తూరు జిల్లా కలకడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. అతని ఛాతిపైన లక్ష్మి అనే పచ్చబొట్టు ఉంది. అతను ఈ మార్గంలోకి ఎందుకు వచ్చాడు.. ఇక్కడ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే కారణాలు తెలియరాలేదు. అతని వద్ద లభించిన ఆధారాలను బట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాగరాజు నాయక్ తెలిపారు.