వేటగాళ్ల బారిన పడిన జింక | Sakshi
Sakshi News home page

వేటగాళ్ల బారిన పడిన జింక

Published Fri, Sep 23 2016 10:59 PM

వేటగాళ్ల బారిన పడిన జింక

మోతుగూడెం :  
వేటగాళ్ల బాణాల దాడికి తీవ్రంగా గాయపడిన ఓ జింక అడవి నుంచి తప్పించుకుని వచ్చి మోతుగూడెంలోని ఓ ఇంట్లోకి చొరబడింది. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. వణుకుతూ, తీవ్ర గాయాలతో ఉన్న జింకను   ఆ ఇంటి యాజమాని పి.దేముడు స్థానికుల సహకారంతో లక్కవరం అటవీ రేంజర్‌ ఉషారాణికి అప్పగించారు. ఆమె తక్షణ వైద్యం కోసం ఆ జింకను  చింతూరు ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించారు.
 

Advertisement
Advertisement