బెంగళూరు: మాండ్య జిల్లాలోని మళవల్లి తాలూకాలోని నెట్కల్ సమీపంలో బెంగళూరు వాటర్ బోర్డ్ నీటి పైప్లైన్ పక్కన ఉన్న అడవిలో ఒక భారీ కొండచిలువ జింకను మింగేసింది. భుక్తాయాసంతో అది కదలకుండా అక్కడే ఉండిపోయింది. స్థానిక యువకులు మొబైల్ ఫోన్లలో కొండచిలువను చిత్రీకరించారు.