బతుకుదెరువు కోసం గుంటూరుకు వెళ్లి పాముకాటుకు గురై మృతి చెందిన రుఖియా(21) మృతదేహం బధవారం ఉదయం స్వగ్రామం కడమకుంట్లకు చేరుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
కడమకుంట్లలో విషాదం
Feb 9 2017 12:58 AM | Updated on Sep 28 2018 3:41 PM
కడమకుంట్ల(తుగ్గలి) : బతుకుదెరువు కోసం గుంటూరుకు వెళ్లి పాముకాటుకు గురై మృతి చెందిన రుఖియా(21) మృతదేహం బధవారం ఉదయం స్వగ్రామం కడమకుంట్లకు చేరుకోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామస్తులు మృతదేహాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సభ్యుల రోదనలు వారిని కలచివేశాయి. గ్రామ సర్పంచ్ సునీత, సింగిల్విండో డైరెక్టర్ అమరనాథరెడ్డి, మాజీ ఎంపీపీ లింగమ్మ, ఎంపీటీసీ సభ్యుడు రామాంజనేయులు, మాజీ సర్పంచ్లు నారాయణ, పక్కీరప్ప రుఖియా మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
Advertisement
Advertisement