ఈ 20న టీపీసీసీ రైతు గర్జన సభ | Tpcc executive meeting in gandhi bhavan | Sakshi
Sakshi News home page

ఈ 20న టీపీసీసీ రైతు గర్జన సభ

Oct 14 2016 9:45 PM | Updated on Jun 4 2019 5:16 PM

గాంధీభవన్ (ఇందిరాభవన్) లో శుక్రవారం టీపీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్: గాంధీభవన్ (ఇందిరాభవన్) లో శుక్రవారం టీపీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, రైతు రుణమాఫీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర అంశాలపై ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై ఏర్పాటు చేసిన సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లురవి,  కార్యవర్గ సభ్యులు, ఎన్ఎస్యూఐ నాయకులు హాజరయ్యారు.

ఈ నెల 20 న మహబుబాబాద్ లో టీపీసీసీ సమన్వయ కమిటీ మీటింగ్ తో పాటు రైతు గర్జన సభ నిర్వహించనున్నట్లు టిపీసీసీ ఉపాధ్యక్షులు మల్లురవి తెలిపారు. రైతుల నుండి రుణమాఫీ పై దరఖాస్తుల స్వీకరణ ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 21 అన్ని కాలేజీలలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ పై ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. నెల రోజులపాటు ఈ దరఖాస్తుల ఉద్యమం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ నరసింహన్ కు అందజేస్తామన్నారు. రాష్ట్ర రైతులకు, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మల్లురవి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement