రాయలసీమ వర్సిటీ కాలేజీ వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు.
రేపు ఆర్యూ కళాశాల వార్షికోత్సవం
Mar 22 2017 12:30 AM | Updated on Sep 5 2017 6:42 AM
కర్నూలు(ఆర్యూ) : రాయలసీమ వర్సిటీ కాలేజీ వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు. గుండెపోటుతో సోమవారం మరణించిన విద్యార్థి శ్రీనివాస్కు మంగళవారం నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా వివిధ ఆటల పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు అందజేస్తామన్నారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రామ్ప్రసాద్ హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు సునిత, రామ్ప్రసాద్, జయప్రతాప్, డీన్ సంజీవరావు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Advertisement


