తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆదివారం జిల్లా...
2న గవర్నర్ రాక
Apr 1 2017 1:44 AM | Updated on Sep 5 2017 7:35 AM
ఏలూరు (మెట్రో) : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆదివారం జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నెల 2న ఉదయం 11.30 గంట లకు విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.50 గంటలకు ద్వారకా తిరుమల వస్తారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ద్వారకా తిరుమల నుంచి హెలికాప్టర్లో గన్నవరం చేరుకుంటారు.
Advertisement
Advertisement