ముగ్గురు వీఆర్‌వోల సస్పెన్షన్‌ | Three VROs suspension | Sakshi
Sakshi News home page

ముగ్గురు వీఆర్‌వోల సస్పెన్షన్‌

Jul 23 2016 10:00 PM | Updated on Sep 4 2017 5:54 AM

పంట నష్ట పోయిన రైతుల జాబితాలో అనర్హులకు చోటు కల్పించిన కుద్వాన్‌పూర్‌ వీఆర్‌వో భూమన్న, వీఆర్‌ఏ లక్ష్మణ్, వెల్మల్‌ వీఆర్‌వో రవిలతో పాటు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బాద్గుణ వీఆర్‌వో పద్మను సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

నందిపేట : పంట నష్ట పోయిన రైతుల జాబితాలో అనర్హులకు చోటు కల్పించిన కుద్వాన్‌పూర్‌ వీఆర్‌వో భూమన్న, వీఆర్‌ఏ లక్ష్మణ్, వెల్మల్‌ వీఆర్‌వో రవిలతో పాటు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బాద్గుణ వీఆర్‌వో పద్మను సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిపై ఆరోపణలు రావడంతో కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు సదరు వీఆర్‌వోలు అక్రమాలకు పాల్పడినట్లు నివేదిక అందజేశారని, వారిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు తహసీల్దార్‌ ఉమాకాంత్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement