డబ్బు విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవలో కోపోద్రిక్తుడైన అన్న ఇనుప రాడ్తో కొట్టడంతో.. తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందాడు.
డబ్బు విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవలో కోపోద్రిక్తుడైన అన్న ఇనుప రాడ్తో కొట్టడంతో.. తమ్ముడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా సైదాపూర్ తండాలో గురువారం వెలుగుచూసింది. తండాకు చెందిన అన్నదమ్ములు మేగావత్ చిన్నా(19), ప్రసాద్(22) ల మధ్య గత కొన్ని రోజులుగా డబ్బుల విషయంలో వాగ్వాదం నడుస్తోంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన ప్రసాద్ పక్కనే ఉన్న ఇనుప రాడ్తో చిన్నా తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.