వేగంగా వెళ్తున్న టాటా ఏస్లో నుంచి దిగడానికి ప్రయత్నించిన యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు.
వేగంగా వెళ్తున్న టాటా ఏస్లో నుంచి దిగడానికి ప్రయత్నించిన యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా జూలూరుపాడులో ఆదివారం చోటుచేసుకుంది. సూరారంకు చెందిన నాగేంద్రబాబు కుటుంబసభ్యులు టాటాఏస్లో కొరివి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనం జూలూరుపాడు వద్దకు రాగానే నాగేంద్రబాబు(23) టాటాఏస్లో నుంచి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి.