యువకుడి అనుమానాస్పద మృతి | The mysterious death of the young man | Sakshi
Sakshi News home page

యువకుడి అనుమానాస్పద మృతి

Jul 18 2016 1:17 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం రామ్‌నగర్‌లోని ఓ చికెన్‌ సెంటర్‌లో పని చేసే ప్రతాప్‌(27) అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు నాలుగో పట్టణ ఎస్‌ఐ సాగర్‌ తెలిపారు.

అనంతపురం సెంట్రల్‌ : అనంతపురం రామ్‌నగర్‌లోని ఓ చికెన్‌ సెంటర్‌లో పని చేసే ప్రతాప్‌(27) అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు నాలుగో పట్టణ ఎస్‌ఐ సాగర్‌ తెలిపారు. తాడిపత్రి మండలం చిల్లకొండయ్యవారిపల్లికి చెందిన లక్ష్మి, నరసింహులు దంపతుల కుమారుడైన ప్రతాప్‌ అనంతపురంలో ఓ గది అద్దెకు తీసుకుంటూ ఉండేవాడు. చికెన్‌ సెంటర్‌లో పని చేస్తూ అక్కడ వచ్చే జీతాన్ని ఇంటికి పంపేవాడు. ఈ క్రమంలో ఆదివారం యథావిధిగా పనికి వెళ్లిన అతను బలమైన గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మరణించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement