చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో ఓ కు గురయ్యాడు
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో ఓ కు గురయ్యాడు. గ్రామానికి చెందిన వినాయక అనే ఏడో తరగతి విద్యార్థి శుక్రవారం నుంచి కనిపించకుండాపోయాడు. దీంతో కుటుంబీకులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వాకబు చేసిన ఫలితం కనిపించలేదు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని గుట్టలో శవమై పడి ఉండగా స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు తెలిపారు. పాతకక్షల నేపథ్యంలో అతడిని ఎవరైనా చంపి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.