పది స్పాట్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

పది స్పాట్‌ ప్రారంభం

Published Mon, Apr 3 2017 11:02 PM

పది స్పాట్‌ ప్రారంభం

- సోషల్‌ టీచర్ల కొరత
 
కర్నూలు సిటీ: పదవ తరగతి స్పాట్‌ వాల్యుయేషన్‌ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 16వ తేది వరకు నిర్వహించే స్పాట్‌కు 1,987 మంది టీచర్లును కేటాయించారు. అయితే సోషల్‌ సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లు తక్కువగా ఉన్నారు. ఉన్న వారు కూడా వయస్సు భారం, అనారోగ్య కారణాల వల్ల రాలేమని డీఈఓకు విన్నివించారు. అయితే స్పాట్‌కు ఆర్డరు ఇచ్చిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా మంగళవారం నాటికి విధుల్లో చేరాలని డీఈఓ తాహెరా సుల్తానా ఆదేశించారు. స్పాట్‌ జరుగుతున్న మాంటిస్సోరి స్కూల్‌లోని కేంద్రాన్ని డీఈఓ తనిఖీ చేశారు. ముల్యాంకనంలో పొరపాట్లకు తావు లేకుండా వ్యవహరించాలని సూచించారు. 
 

Advertisement
Advertisement