రోడ్డు విస్తరణలో ఉద్రిక్తత | tension in vijayawada chittinagar | Sakshi
Sakshi News home page

రోడ్డు విస్తరణలో ఉద్రిక్తత

Feb 27 2016 7:21 PM | Updated on Aug 30 2018 5:49 PM

నగరంలోని చిట్టినగర్ రోడ్డు విస్తరణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

విజయవాడ: నగరంలోని చిట్టినగర్ రోడ్డు విస్తరణలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  విస్తరణ పనుల కోసం అధికారులు అమ్మవారి ఆలయాన్ని తొలగించడానికి ప్రయత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌కు, దేవాలయ కమిటీ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. రోడ్డు విస్తరణ చేయాల్సిందే అని మున్సిపల్ అధికారులు పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలువురు స్థానికులను అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement