జిల్లాలో కొన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మరికొన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి.
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో కొన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మరికొన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతల మేరకు తనకల్లు మండలంలో కేవలం 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అగళిలో 9.7 డిగ్రీలు, మడకశిర 10.1 , సోమందేపల్లి 11.4 , రొద్దం 11.7 , ఎన్పీ కుంట 12.1 , నల్లమాడ 12.2 , నల్లచెరువు 12.6 , అమరాపురం 12.8 , గాండ్లపెంట, పుట్లూరులో 12.9 డిగ్రీలు నమోదు కావడంతో చలితీవ్రత కొనసాగింది.
మిగతా మండలాల్లో 13 నుంచి 19 డిగ్రీల వరకు కొనసాగాయి. అత్యధిక పగటి ఉష్ణోగ్రత పామిడిలో 37.7 డిగ్రీలు నమోదైంది. గుంతకల్లు, తాడిపత్రి, శింగనమలలో కూడా 36 డిగ్రీలకు పైబడి కొనసాగింది. మిగతా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.