► రైతు సంఘంలో ఉన్నట్లు మోసం
► ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ సబ్సిడీ కింద
ట్రాక్టర్ తీసుకున్న టీడీపీ నాయకుడు
► కేసు నమోదు చేయాలంటున్న బాధితులు
వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నాయకుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతుంది. ఓ టీడీపీ నాయకుడు ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ సబ్సిడీ కింద ట్రాక్టర్ తీసుకున్న ఘటన వైఎస్సార్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...చాపాడు మండలంలోని రాజుపాళెంకు చెందిన టీడీపీ నాయకుడు పల్లెం శ్రీనివాసులు ఓ రైతు కుటుంబం నుంచి పట్టాదారు పాసుబుక్, రేషన్, ఆధార్ కార్డులు తీసుకుని ఫోర్జరీ సంతకాలతో సబ్సిడీ కింద ట్రాక్టర్ తీసుకున్నాడు. దీనిపై అధికారులు కూడా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బాధిత మహిళ జాకట జ్యోతి తెలిపారు.
పల్లెం శ్రీనివాసులు మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జీ పుట్టా సుధాకర్యాదవ్ ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. గతేడాది కురిసిన అకాల వర్షాలకు రాజుపాళెంకు చెందిన జాకట స్వామిదానం, జ్యోతిలకు చెందిన వరి, మినుము పంట దెబ్బతింది. ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పల్లెం శ్రీనివాసులు అప్పట్లో పంటకు నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి జ్యోతి పేరుతో ఉన్న 1.26 ఎకరాల పట్టాదారు పాసుబుక్, ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ పత్రాలను ఇప్పించుకున్నాడు.
దీనికి ముందే రాజుపాళెంలో శ్రీవెంకటేశ్వర రైతు మిత్ర సంఘం సృష్టించి రూ.6 లక్షలు విలువ చేసే ట్రాక్టర్ను రూ.3లక్షల సబ్సిడీతో ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీనివాసులు పొందాడు. ఈ గ్రూపులో జాకట జ్యోతి సభ్యురాలు. శ్రీనివాసులు బంధువులైన పి.గంగన్న, ఎం.రామసుబ్బయ్య, ఎం.గోపాల్, ఎం.పెద్దబాలయ్యల పేర్లతో సబ్సీడీ కింద ట్రాక్టర్ పొందినట్లు విషయం తెలుసుకున్న జ్యోతి దంపతులు అవాక్కయ్యారు. తాను ఎలాంటి సంతకాలు పెట్టలేదని, పంట నష్ట పరిహారం కోసం శ్రీనివాసులుకు భూమి, ఆధార్, రేషన్కార్డుల పత్రాలు ఇచ్చామని, తన సంతకాలను ఫోర్జరీ చేశాడని విచారం వ్యక్తం చేశారు. కనీసం వ్యవసాయాధికారులు కూడా విషయం తమకు తెలుపలేదని వాపోయారు.
ఎస్సీ, ఎస్టీ, 420 కేసులు నమోదు చేయాలి
దళితులమైన తమను నమ్మించి తమ పత్రాలను తీసుకుని, ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వం నుంచి సబ్సిడీ కింద ట్రాక్టర్ పొందిన పల్లెం శ్రీనివాసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 420 కేసు నమోదు చేయాలని దళిత దంపతులు స్వామినాథం, జ్యోతిలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామన్నారు.
అన్ని రకాలైన పత్రాలు ఉండటంతో మంజూరు
ఈ ఘటనపై మండల వ్యవసాయాధికారి సురేష్బాబును వివరణ కోరగా శ్రీవెంకటేశ్వర రైతు మిత్రం సంఘం పేరుతో అన్ని రకాలైన ఆధార పత్రాలు, సంతకాలు ఉండటంతో ట్రాక్టర్ మంజూరైందని తెలిపారు.
పుట్టా అనుచరుడా.. మజాకా!
Published Wed, May 4 2016 11:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్కు రెబల్గా మారనుంది’
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement