వంశధార నిర్వాసితులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి
వంశధార నిర్వాసితులతో చర్చలు విఫలం
Dec 25 2016 2:26 PM | Updated on Sep 4 2017 11:35 PM
శ్రీకాకుళం: హిర మండలం పాడలి గ్రామంలో వంశధార నిర్వాసితులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నాలుగు రోజుల క్రితం ఆందోళన నిర్వహించిన నిర్వాసితులు నిర్మాణ పనులు ఆపించారు. పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్య, తహశిల్దార్ కాళీప్రసాద్, డీఎస్పీ ఆదినారాయణలు వంశధార పనులకు సహకరించాలని కోరుతూ నిర్వాసితులతో ఆదివారం చర్చించారు. అయితే అధికారుల సమాధానంతో నిర్వాసితులు సంతృప్తి చెందలేదు.
Advertisement
Advertisement