సింహాచలంలో తలనీలాలు చోరీ | Talanilalu robbery in simhachalam temple | Sakshi
Sakshi News home page

సింహాచలంలో తలనీలాలు చోరీ

Feb 15 2016 11:45 AM | Updated on Aug 30 2018 5:27 PM

సింహాచలంలో తలనీలాలు చోరీ - Sakshi

సింహాచలంలో తలనీలాలు చోరీ

మొక్కుల రూపంలో దేవునికి సమర్పించుకున్న తలనీలాలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.

సింహాచలం: మొక్కుల రూపంలో దేవునికి సమర్పించుకున్న తలనీలాలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన విశాఖపట్నం సింహాచలం దేవస్థానంలో సోమవారం వెలుగుచూసింది. ఆలయంలోని కేశఖండనశాలలో గ్రేడింగ్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 15 బస్తాల తలనీలాలను దుండగులు అపహరించుకుపోయారు. ఇది గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. చోరీకి గురైన తలనీలాల విలువ సుమారు రూ. 8 లక్షల వరకు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement