►ఇద్దరు చిన్నారులతో నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
►మూడు మృతదేహాలను గుర్తించిన స్థానికులు
►రామిరెడ్డిపాళెంలో విషాదం
వరదయ్యపాళెం: ఆ తల్లి ఏమాత్రం సర్దుకుపోయినా ఆమెతో పాటు మూడు ప్రాణాలు నిలిచేవి. కానీ క్షణికావేశంతో తొందరపడింది. ఫలితంగా మానసిక స్పర్థ మూడు ప్రాణాలను బలిగొంది. వరదయ్యపాళెం మండలం రా మిరెడ్డిపాలెంలో బుధవారం ఈ విషాద సంఘటన జరిగింది. వివరాలివి.. రామిరెడ్డిపాళెంకు చెందిన కె.శ్రీను, సుప్రియ(29) దంపతులకు ఇద్దరు కుమార్తెలు లోహిత(08), తేజశ్రీ(04). శ్రీను వరదయ్యపాళెంలో చిన్నపాటి దాబా నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఉమ్మడి కుటుంబంలో ఏర్పడిన విబేధాల కారణంగా శ్రీను, అతని సోదరుడు వేర్వేరుగా కుటుంబాలతో గ్రామంలోనే ఉంటున్నారు. మంగళవారం సత్యవేడు సమీపంలో సోదరుడు నిర్వహించిన పొంగళ్లు కార్యక్రమానికి శ్రీను తన పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్లి వచ్చాడు. ఈ విషయమై మంగళవారం రాత్రి భార్య, భర్తల మద్య వాగ్వాదం జరిగింది. బుధవారం ఉదయం ఎప్పటిలాగే శ్రీను డాబాహోటల్ నిర్వహణకు వరదయ్యపాళెంవెళ్లాడు. మంగళవారం రాత్రి గొడవ నేపథ్యంలో సుప్రియ బుధవారం ఉదయం 11గంటకర ఇంట్లోనుంచి దుస్తుల మూట చేతపట్టుకుని పిల్లలిద్దరినీ వెంటపెట్టుకుని శివారులోని తామరగుంట నీళ్ల మడుగుకు వెళ్లింది.
ఆమె ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు తామరగుంట వద్దకు వెళ్లి పరిశీలించారు. గట్టున దుస్తులు, చెప్పులు కనిపించాయి. అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో అనుమానం వచ్చి సమీప ప్రాంతాల్లోనూ వెతికారు. ఎంతసేపటికీ ఆచూకీ లభించకపోవడంతో తామర గుంట వద్దకే మళ్లీ వెళ్లి పరిశీలిస్తుండగా మడుగులో నుంచి తల్లీ, బిడ్డల మృతదేహాలు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. స్థానికులు ఈ మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. చిన్నపాటి విషయమేనని తాను భావించి హోటల్కు వెళ్లిపోగా ప్రాణాలు తీసుకుందంటూ శ్రీను రోదించాడు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
ప్రాణాలు తీసిన మనస్పర్థలు
Published Thu, May 11 2017 1:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement