క్షీణించిన విద్యార్థుల ఆరోగ్యం | Students Hunger Strike To Announce Gadwal As District | Sakshi
Sakshi News home page

క్షీణించిన విద్యార్థుల ఆరోగ్యం

May 17 2016 5:31 PM | Updated on Sep 4 2017 12:18 AM

క్షీణించిన విద్యార్థుల ఆరోగ్యం

క్షీణించిన విద్యార్థుల ఆరోగ్యం

మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో నిరాహార దీక్షకు కూర్చున్న విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

గద్వాల్:  మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌తో నిరాహార దీక్షకు కూర్చున్న విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మూడు రోజులుగా గంజిపేట రాజా, ఇమ్మనేయులు, మోహిద్‌ఖాన్‌లు అనే విద్యార్థులు గద్వాలలో నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ వైద్యులు కిషోర్, గోవర్దన్ శిబిరం వద్దకు చేరుకుని ముగ్గురు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాజా, ఇమ్మనేయులు శరీరంలో గ్లూకోజ్, షుగర్ లెవెల్ కనీస స్థాయికన్నా తగ్గాయని తెలిపారు. బీపీ కూడా సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉందన్నారు. ఎలాంటి ద్రవపదార్థాలు తీసుకోకపోవటంతో కిడ్నీలపై ప్రభావం పడుతోందని తెలిపారు. ఇలాగే మరో ఆరుగంటలు గడిస్తే వారి ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని చెప్పారు

Advertisement
 
Advertisement
Advertisement