విద్యార్థి ఆత్మహత్య | Student suicide | Sakshi
Sakshi News home page

విద్యార్థి ఆత్మహత్య

Aug 18 2016 12:06 AM | Updated on Nov 9 2018 5:02 PM

డిగ్రీ పాస్‌ కానేమోనని ఆందోళనకు గురైన ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని 54వ డివిజన్‌ దేవన్నపేటలో బుధవారం చోటు చేసుకుంది.

హసన్‌పర్తి : డిగ్రీ పాస్‌ కానేమోనని ఆందోళనకు గురైన ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నగరంలోని 54వ డివిజన్‌ దేవన్నపేటలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. దేవన్నపేటకు చెందిన కందకట్ల రాకేష్‌ (22) నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదివాడు. అయితే ఫైనల్‌æఇయర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో మళ్లీ పరీక్ష కోసం ఫీజు కట్టాడు. కాగా, త్వరలో రాసే పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానేమోననే భయం పట్టుకుంది. ఈ క్రమంలో మంగళవారం కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లగా రాకేష్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement