రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా, రామకుప్పంలో జరిగింది.
సైకిల్పై కాలేజీకి వెళుతున్న విద్యార్ధినిని ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని భజన నర్తం గ్రామంలో జరిగింది. జూనియర్ ఇంటర్ చదువుతున్న నందిని(17) సైకిల్పై కాలేజీకి బయలు దేరింది. మార్గ మధ్యంలో సైకిల్ను భైక్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన నందిని అక్కడికక్కడే మృతి చెందింది.