విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి | student died by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి

Jun 17 2017 12:33 AM | Updated on Nov 9 2018 5:02 PM

ములుగుందం గ్రామంలో పదో తరగతి విద్యార్థిని విద్యుదాఘాతంతో మృతి చెందింది.

ఆస్పరి: ములుగుందం గ్రామంలో పదో తరగతి విద్యార్థిని విద్యుదాఘాతంతో మృతి చెందింది. గ్రామానికి చెందిన నిరుపేద కూలీలు జాన్సన్, చంద్రమ్మ దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. వీరి చివరి కుమార్తె సుష్మ ఆదోని మండలం అరెకల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ సంవత్సరం పదో తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లగా వేసవి సెలవుల్లో బాలిక కూడా వారి వెంట వెళ్లింది. పాఠశాలలు ప్రారంభం కావడంతో బడికి వెళ్లేందుకు అన్న అనిల్,  అక్క సునీతతో సుష్మ గురవారం రాత్రి గ్రామానికి చేరుకున్నారు. శుక్రవారం ఇంట్లో గోడకు విద్యుత్‌ సరఫరా కావడం, ఇది గమనించని సుష్మ గోడను తాకడంతో  విద్యుదాఘాతానికి గురై అక్కడకక్కడే మృతి చెందింది. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాలిక మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement