మూడు నెలల్లో ప్రత్యేక హోదాపై స్పష్టత | Special status resolution in three months | Sakshi
Sakshi News home page

మూడు నెలల్లో ప్రత్యేక హోదాపై స్పష్టత

Oct 27 2015 2:24 AM | Updated on Mar 23 2019 9:10 PM

మూడు నెలల్లో ప్రత్యేక హోదాపై స్పష్టత - Sakshi

మూడు నెలల్లో ప్రత్యేక హోదాపై స్పష్టత

ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం మూడు నెలల్లో స్పష్టతనిస్తుందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు

ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి

 ఉయ్యూరు/మచిలీపట్నం (చిలకలపూడి): ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కేంద్రం మూడు నెలల్లో స్పష్టతనిస్తుందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఉయ్యూరు, మచిలీపట్నంలో సోమవారం పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ రూపొందించిన నీతి ఆయోగ్ నివేదికతో రాష్ట్రానికి మంచి అవకాశాలొస్తాయని కేఈ ఆశాభావం వ్యక్తం చేశారు.  రాష్ట్రానికి ప్రధాని ప్రత్యేక హోదా, నిధులు ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు విభజన సమయంలో నోరు మెదపకుండా ఇప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement