వైభవంగా సిడిమానోత్సవం | sidi manothsavam in mallapuram | Sakshi
Sakshi News home page

వైభవంగా సిడిమానోత్సవం

Sep 28 2016 11:22 PM | Updated on Sep 4 2017 3:24 PM

వైభవంగా సిడిమానోత్సవం

వైభవంగా సిడిమానోత్సవం

రాయదుర్గం మండలం మల్లాపురం సమీపంలో బుధవారం కుంటు మారెమ్మ సిడిమానోత్సవం ఆశేష జనవాహిని మధ్య వైభవంగా జరిగింది.

రాయదుర్గం మండలం మల్లాపురం సమీపంలో బుధవారం కుంటు మారెమ్మ సిడిమానోత్సవం ఆశేష జనవాహిని మధ్య వైభవంగా జరిగింది. తిప్పేస్వామి అనే భక్తుడిని సిడిమానుకు కట్టి చుట్టూ కలియతిప్పారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు మల్లాపురం, పల్లేపల్లి, చదం, చదం గొల్లలదొడ్డి, రాయదుర్గం పట్టణ ప్రజలతో పాటు కర్ణాటక ప్రజలు భారీగా తరలివచ్చారు. అమ్మ వారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ  సభ్యులు తీర్థప్రసాదాలు అందచేశారు. పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.           

Advertisement
 
Advertisement
Advertisement