
గతంలో వలే కాకూడదు !
రాబోయే ఖరీఫ్కు అన్నదాతలను సమాయత్తం చేయడానికి వ్యవసాయశాఖ నడుం బిగించింది.
⇒‘మన తెలంగాణ – మన వ్యవసాయం’
⇒పకడ్బందీగా నిర్వహణకు ప్రభుత్వం ఆదేశం
⇒పర్యవేక్షణకు జిల్లాకు కన్సల్టెంట్ నియామకం
⇒అనుబంధశాఖల ఉద్యోగులతో సమావేశం
⇒ప్రణాళికలు సిద్ధం చేసిన జిల్లా వ్యవసాయశాఖ
సుభాష్నగర్ (నిజామాబాద్ అర్బన్) : రాబోయే ఖరీఫ్కు అన్నదాతలను సమాయత్తం చేయడానికి వ్యవసాయశాఖ నడుం బిగించింది. నూతన యాజ మాన్య పద్ధతులు, శాస్త్రసాంకేతికను జోడించి రైతులను లాభాల బాటలో నడిపించేందుకు ప్రభుత్వం ‘మన తెలంగాణ– మన వ్యవసాయం’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కార్యక్రమాన్ని ఈనెల 5 నుంచి 16వ వరకూ పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా వ్యవసాయశాఖ ప్ర ణాళికలు రూపొందిం చింది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్ర తియేటా నిర్వహిస్తున్నప్పటికీ అనుకున్నంత సత్ఫలి తా లు రాలేదు. అందుకు గల కారణాలు, వైఫల్యాలు, లోపాలను అధిగమించి ఈ యేడాది పకడ్బందీగా ని ర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇ ప్పటికే వ్యవసాయ, అనుబంధశాఖల అ ధికారులను ఆదేశించారు. ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ ను రైతులు అధిక సంఖ్య లో వినియోగించుకుంటారని అధికారులు భావిస్తున్నారు.
పకడ్బందీగా..
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సు మారు 4.30 లక్షల మంది రైతులు ఉన్నా రు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు చైతన్య సదస్సు’ల పేరుతో కార్యక్రమాలను నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లుగా ‘మన తెలంగాణ– మన వ్యవసాయం’ నిర్వహిస్తోంది. అయినప్పటికీ సత్ఫలితాలు సాధించలేకపోయారు. దీంతో కోట్ల రూపాయలు వృథా అయ్యాయి. రాష్ట్రంలో సాగును యజ్ఞం లా చేపట్టాలని కేసీఆర్ పిలుపుతో ఈయేడాది నిర్వహించే ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ నకు ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో వలే సదస్సులను తూతూమంత్రంగా కాకుండా పకడ్బం దీగా నిర్వహించేలా ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రతి రోజు రెండు నుంచి మూడు గ్రామాల్లో సదస్సులు నిర్వహించేలా ప్లాన్ రూపొం దించారు. ఉదయం 7.30 గంటల నుంచే అధికారులు గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నారు.
అధికారులకు దిశానిర్ధేశం
‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిషనరేట్లో కన్సల్టెంట్గా ఉన్న రిటైర్డ్ వ్యవసాయ అధికారి నజీముద్దీన్ను కేటాయించింది. శనివారం ఆయ న ప్రగతిభవన్లో వ్యవసాయం, దాని అనుబంధశాఖల అధికారులతో ఇప్పటి కే సమావేశం నిర్వహించారు. కార్యక్ర మ ం విజయవంతం చేయడానికి చేయాల్సి న ఏర్పాట్లు, వివిధ శాఖల అధికారు ల సమన్వయం, రైతువారీగా సేకరించాల్సి న సమాచారం, క్రాప్కాలనీల ఏర్పా టు, తదితర అంశాల గురించి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతున్న తరుణంలో కార్యక్రమ ఉద్దేశం, గ్రామా ల్లో ని ర్వహించే సదస్సులకు హాజ రుకావాల్సినఅధికారుల బృందం,చర్చించాల్సిన , తదితర అంశాల గురించి వివరిం చారు . ఆయన ఈ కార్యక్రమం ముగిసేవరకూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.
సదస్సులో పాల్గొనే అధికారులు..
జిల్లాలో ఈనెల 5 నుంచి 16 వరకు నిర్వహించే ‘మన తెలంగాణ– మన వ్యవసాయం’ కార్యక్రమానికి వ్యవసాయం, అనుబంధశాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా ఈ కార్యక్రమా న్ని విజయవంతం చేసేందుకు మండలంలో వివిధశాఖల అధికారులు ఒక బృందంగా ఏర్పడ్డారు. బృందానికి మం డల వ్యవసాయాధికారి కో ఆర్డినేటర్గా వ్యవహరిస్తారు. సదస్సుకు మండల వ్యవసాయాధికారి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, మండల పశువైద్యాధికారి, హార్టికల్చర్, మత్య్సశాఖ, మార్కెటింగ్, సోషల్ ఫారెస్ట్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్పంచి, ఏఈఓలు, తదితర శా ఖల అధికారులు తప్పనిసరిగా హాజ రుకావాలి. సదస్సులు జరిగినన్ని రోజులు పైన పేర్కొన్న అధికారులు పాల్గొని ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు వివరించాలి. రైతుల సందేహాలను నివృత్తి చేయాల్సి ఉం టుంది. సదస్సులకు హాజరుకాని వారి వివరాలను ఎప్పటికప్పుడు కలెక్టర్, సం బంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు.