స.హ. కార్యక్తరకు అవార్డు | RTI activist get award | Sakshi
Sakshi News home page

స.హ. కార్యక్తరకు అవార్డు

Aug 16 2016 10:53 PM | Updated on Sep 22 2018 8:22 PM

స.హ. కార్యక్తరకు అవార్డు - Sakshi

స.హ. కార్యక్తరకు అవార్డు

కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎండీ అష్రఫ్‌ ఉత్తమ సమాచార హక్కు చట్టం కార్యకర్తగా ఎంపికయ్యారు. పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి జోగు రామన్న, కలెక్టర్‌ జగన్మోహన్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కాగజ్‌నగర్‌కు చేరుకున్న అశ్రఫ్‌ను మంగళవారం పలువురు అభినందించారు.

కాగజ్‌నగర్‌ : కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎండీ అష్రఫ్‌ ఉత్తమ సమాచార హక్కు చట్టం కార్యకర్తగా ఎంపికయ్యారు. పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి జోగు రామన్న, కలెక్టర్‌ జగన్మోహన్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కాగజ్‌నగర్‌కు చేరుకున్న అశ్రఫ్‌ను మంగళవారం పలువురు అభినందించారు.
        ఈ సందర్భంగా అష్రఫ్‌ మాట్లాడుతూ 2006 నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా అనేక అవినీతి అంశాలను బయటకు తీసి ప్రభుత్వానికి 15 కోట్లకు పైగా ఆదాయం కల్పించినందుకు గాను తనను ఈ అవార్డు కోసం ఎంపిక చేసినట్లు వివరించారు. రానున్న రోజుల్లో కూడా అవినీతిపై సమరం సాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. పలువురు ఉపాధ్యాయులు, పట్టణ వాసులు అష్రఫ్‌కు అభినందనలు తెలిపారు. అవార్డు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement