భద్రాచలం అభివృద్ధికి రూ.100కోట్లు | Rs 100 crore for the development of Bhadrachalam temple: KCR | Sakshi
Sakshi News home page

భద్రాచలం అభివృద్ధికి రూ.100కోట్లు

Apr 15 2016 2:45 PM | Updated on Aug 14 2018 10:54 AM

భద్రాచలం పట్టణం, రామాలయం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

భద్రాచలం(ఖమ్మం): భద్రాచలం పట్టణం, రామాలయం అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆయన శుక్రవారం ప్రభుత్వం తరఫున భద్రాచల రాముల వారి కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు  సమర్పించారు. కల్యాణం అనంతరం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో రెండు సాగు నీటి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో జిల్లాలోని ప్రతి అంగుళం భూమికి నీటి వసతి ఉండేలా చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement