తల్లికోసం తల్లడిల్లి.. | ropes for mother | Sakshi
Sakshi News home page

తల్లికోసం తల్లడిల్లి..

Sep 10 2016 10:48 PM | Updated on Sep 4 2017 12:58 PM

తల్లికోసం తల్లడిల్లి..

తల్లికోసం తల్లడిల్లి..

మండలంలోని వడగామ్‌ గ్రామపంచాయతీ పరిధిలోని లింగపూర్‌ గ్రామానికి చెందిన మెస్రం అనుసూయబాయి(35) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారు జమున మృతి చెందింది.

  • తల్లి మృతి.. అనాథలైన పిల్లలు
  • ఇంద్రవెల్లి : మండలంలోని వడగామ్‌ గ్రామపంచాయతీ పరిధిలోని లింగపూర్‌ గ్రామానికి చెందిన మెస్రం అనుసూయబాయి(35) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారు జమున మృతి చెందింది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. లింగాపూర్‌ గ్రామానికి చెందిన మెస్రం మారుతికి వడగామ్‌ గ్రామానికి చెందిన అనుసూయబాయితో వివాహం చేశారు.
    వీరికి ముగ్గురు సంతానం. లక్ష్మీ(12), గణేష్‌(8), రామ్‌చరణ్‌ (1) ఉన్నారు. మారుతి గత సంవత్సరం వేరే మహిళతో మరో వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి మారుతి ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. అనుసూయ ఆరోగ్యం బాగలేకపోయిన కులీ పనులు చేసి ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం నుంచి అనుసూయబాయి అనారోగ్యంతో బాధపడుతోంది.
    భర్త లేక, వైద్యం చేయించడానికి ఇంట్లో ఆర్థిక స్తోమత లేకపోవడంతో రోజు రోజుకూ పరిస్థితి విషమించి అనసూయబాయి శనివారం మృతి చెందింది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. లింగపూర్‌ గ్రామంలో విషాధచాయలు అములుకున్నాయి.
     

Advertisement
 
Advertisement
Advertisement