ప్రభుత్వం పునరాలోచించాలి | rethink the government | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం పునరాలోచించాలి

Aug 26 2016 11:52 PM | Updated on Sep 4 2017 11:01 AM

ముకరంపుర: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన రిలేనిరాహార దీక్షలు శుక్రవారం ముగిసాయి. దీక్షలకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సంఘీభావం తెలిపారు.

ముకరంపుర: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌  ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన రిలేనిరాహార దీక్షలు శుక్రవారం ముగిసాయి. దీక్షలకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సంఘీభావం తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన డబుల్‌ బెడ్రూం పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. ‘డబుల్‌ బెడ్రూం’ను ప్రారంభించి అందులో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించుకోకుండా వారిని తొలగించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలన్నారు. అనంతరం ఏజేసీని కలిసి వినపతి పత్రం సమర్పించారు. సాయంత్రం టీఎన్‌జీవోలు దీక్షలు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం కలెక్టర్‌ నీతూప్రసాద్‌ను కలిసి విన్నవించగా 143 మంది ఉద్యోగులను విడతలవారీగా అర్హతలను బట్టి రిక్రూట్‌ చేసుకుంటామని హామీ ఇచ్చారు.  యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.కుమారస్వామి, యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి, కోశాధికారులు వి.నాగచారి, డి.ప్రభాకర్, సి.హెచ్‌.జంపయ్య, ఎండీ ఇలియాస్, ఉపాధ్యక్షులు ఇ.రాజయ్య, బి.కుమారస్వామి, లావణ్య, శ్రీనివాసస్వామి, జి.సమ్మయ్య, ఎ.శ్యాంసుందర్, ఎం.కవిత, ఎస్‌.శ్రీదేవి, సీహెచ్‌.రమాదేవి, ఎస్‌.బాబురావు తదితరులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement