ఘనంగా రెడ్‌ఎఫ్‌ఎం వినాయకుని నిమజ్జనం

ఘనంగా రెడ్‌ఎఫ్‌ఎం వినాయకుని నిమజ్జనం

సాక్షి,సిటీబ్యూరో: చిలుకూరు దేవస్థానం సమీపంలో 93.5 రెడ్‌ఎఫ్‌ఎం ప్రతిష్టించిన విలేజ్‌ వినాయకుని నిమజ్జనం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మొయినాబాద్‌ ఎస్‌ఐ శ్రీరాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదువుల దేవుడైన వినాయకుని అండతో ఈ వినాయక చవితికి చిలుకూరు సమీపంలో జీర్ణావస్థలో ఉన్న ఓ ప్రభుత్వ బడిని ఈ కార్యక్రమం ద్వారా పునరుద్ధరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ‘సాక్షి’ మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరించిందన్నారు. సినీ ప్రముఖులు ఎన్టీఆర్, కొరటాల శివ, అవసరాల శ్రీనివాస్, విజయ్‌ దేవరకొండ, రెజీనా, నాని తదితరులు, ఇతర దాతలు స్వచ్ఛందంగా విరాళాలిచ్చి సహకరించారని తెలిపారు. 

 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top