దుర్గమ్మ సన్నిధిలో పీవీ సింధు | pv sindu family visits vijayawada kanakadurga temple | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సన్నిధిలో పీవీ సింధు

Sep 26 2016 9:10 AM | Updated on Sep 4 2017 3:05 PM

దుర్గమ్మ సన్నిధిలో పీవీ సింధు

దుర్గమ్మ సన్నిధిలో పీవీ సింధు

రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగుతేజం పీవీ సింధు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది.

విజయవాడ: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, తెలుగుతేజం పీవీ సింధు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం సింధు తన కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వెళ్లింది.

అధికారులు ఆలయ మర్యాదలతో సింధు కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం సింధు కుటుంబ సభ్యులకు ప్రసాదం అందజేశారు. అమ్మవారి ఫొటోను బహూకరించారు. సింధు వెంట తల్లిదండ్రులు విజయ, రమణ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో సింధు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement