సింహాద్రి విద్యుత్‌ పునరుద్ధరణ | Power Restoration in simhadro powr plant | Sakshi
Sakshi News home page

సింహాద్రి విద్యుత్‌ పునరుద్ధరణ

Aug 10 2016 11:30 PM | Updated on Sep 18 2018 8:37 PM

సింహాద్రి ఎన్టీపీసీ మొదటి యూనిట్‌లో నిలిచిపోయిన విద్యుదుత్పత్తిని మరమ్మతుల అనంతరం బుధవారం పునరుద్ధరించారు.

పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీ మొదటి యూనిట్‌లో నిలిచిపోయిన విద్యుదుత్పత్తిని మరమ్మతుల అనంతరం బుధవారం పునరుద్ధరించారు. సోమవారం రాత్రి సాంకేతిక కారణాల వల్ల మొదటి యూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయిన విషయం తెలిసిందే. బాయిలర్‌లో ఏర్పడిన సమస్యల వల్ల అంతరాయం ఏర్పడింది. ఎన్టీపీసీ అధికారులు మంగళవారమంతా శ్రమించి మరమ్మతు పనులు పూర్తి చేసి బుధవారం ఉదయానికి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారని ఎన్టీపీసీ అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement