మైనింగ్‌ శాఖ కార్యాలయానికి పవర్‌ కట్‌ | power cut for mining department office | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ శాఖ కార్యాలయానికి పవర్‌ కట్‌

Nov 16 2016 9:27 PM | Updated on Sep 4 2017 8:15 PM

మైనింగ్‌ శాఖ కార్యాలయానికి పవర్‌ కట్‌

మైనింగ్‌ శాఖ కార్యాలయానికి పవర్‌ కట్‌

బకాయిలు చెల్లించని మైనింగ్‌ శాఖ డీడీ కార్యాలయానికి బుధవారం విద్యుత్‌ శాఖాధికారులు పవర్‌ కట్‌ చేశారు. మూడు నెలల నుంచి రూ.23 వేల బకాయి ఉండడంతో పలుమార్లు హెచ్చరించారు.

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): బకాయిలు చెల్లించని మైనింగ్‌ శాఖ డీడీ కార్యాలయానికి బుధవారం విద్యుత్‌ శాఖాధికారులు పవర్‌ కట్‌ చేశారు. మూడు నెలల నుంచి రూ.23 వేల బకాయి ఉండడంతో పలుమార్లు హెచ్చరించారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపి వేశారు. ఈ నేపథ్యంలో సిబ్బంది చీకటిలో విధులు నిర్వహించారు. మూడు నెలల నుంచి రెగ్యులర్‌ డీడీ లేకపోవడం..ఇన్‌చార్జి అధికారి పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అక్కడి సిబ్బంది తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement