భూమిని సద్వినియోగం చేసుకోవాలి | poor people utilise the land | Sakshi
Sakshi News home page

భూమిని సద్వినియోగం చేసుకోవాలి

Jul 20 2016 7:57 PM | Updated on Sep 4 2017 5:29 AM

టేకు మొక్కలు నాటుతున్న అధికారి రామ్‌లక్ష్మణ్‌

టేకు మొక్కలు నాటుతున్న అధికారి రామ్‌లక్ష్మణ్‌

ప్రభుత్వం నిరుపేద ఎస్సీలకు ఇచ్చిన భూమిని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్య మంత్రి ముఖ్య సలహాదారు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రామ్‌లక్ష్మణ్‌ సూచించారు.

  • సీఎం ముఖ్య సలహాదారు రామ్‌లక్ష్మణ్‌
  • మిడ్జిల్‌: ప్రభుత్వం నిరుపేద ఎస్సీలకు ఇచ్చిన భూమిని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్య మంత్రి ముఖ్య సలహాదారు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రామ్‌లక్ష్మణ్‌ సూచించారు. బుధవారం మండలంలోని కొత్తూర్‌ గ్రామంలో ప్రభుత్వం గతేడాది ముగ్గురు ఎస్సీ రైతులకు తొమ్మిది ఎకరాల భూమిని ఇచ్చింది. ఈ భూమిలో హరితహారంలో భాగంగా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రెండువేల టేకు మొక్కలను నాటుతుండగా, ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. టేకు మొక్కలను పెంచడంతో అధిక లాభాలు గడించవచ్చన్నారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సారయ్య, డీడీలు విజయ్‌కుమార్, సంధ్యారాణి,ఎంపీడీఓ కుమారస్వామి, సర్పంచ్‌ కష్ణ పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement