పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదాం.. ప్రగతికి మెట్లు.. పచ్చని చెట్లు.. అంటూ వందలాది గొంతులు గళమెత్తాయి. గంటలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సోమవారం పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో విద్యార్థులు మానవహారం చేపట్టారు.
మొక్కోద్యమం
Aug 9 2016 1:24 AM | Updated on Sep 18 2018 6:30 PM
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదాం.. ప్రగతికి మెట్లు.. పచ్చని చెట్లు.. అంటూ వందలాది గొంతులు గళమెత్తాయి. గంటలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సోమవారం పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో విద్యార్థులు మానవహారం చేపట్టారు. ప్రకృతిని పరిరక్షిస్తాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాల ఆవరణలు, రోడ్డుకిరువైపులా లక్ష మొక్కలు నాటారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్చైర్మన్ కర్నేన రోజారమణి, కౌన్సిలర్లు గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి బాబు, తమ్మినీడి సత్యనారాయణ, మేడిశెట్టి సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement