Sakshi News home page

పట్టాభి రాముడు

Published Tue, Aug 30 2016 10:34 PM

రామయ్యకు కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

  • శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం
  • పులకించిన భక్తజనం
  • భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామి వారికి మంగళవారం పుష్యమి నక్షత్రం సందర్భంగా వైభవంగా పట్టాభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం నిర్వహించి, గోదావరి తీర్థ జలాలతో భద్రుని గుడిలో అభిషేకం చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారి మూర్తులను ఆలయ బేడా మండపంలోకి చేర్చి..వేద మంత్రోచ్ఛరణల మధ్య నిత్యకల్యాణం జరిపించారు. అనంతరం ఘనంగా పట్టాభిషేకం చేశారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రామాలయ ప్రాంగణంలోని ఆంజేయ స్వామికి ఘనంగా అభిషేకం నిర్వహించారు. లక్ష తమలపాకులతో పూజలు చేశారు.

    • భజనలు..పూజలు

    భద్రాచలం : ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భక్తులు మంగళవారం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భజనలు చేశారు. ఉదయమే ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి..ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీతాయారమ్మ వారిని, ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. భజనలతో తరలించారు.

     

Advertisement
Advertisement