చెక్‌ బౌన్స్ కేసులో ఏడాది జైలు | one year jail in check bounce case | Sakshi
Sakshi News home page

చెక్‌ బౌన్స్ కేసులో ఏడాది జైలు

Dec 22 2016 12:47 AM | Updated on Sep 4 2017 11:17 PM

గుత్తి: చెక్‌ బౌన్స్ కేసులో దోషి హెచ్‌సీ గురు ప్రసాద్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఏడీజే కే.వెంకటరమణారెడ్డి బుధవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

గుత్తి: చెక్‌ బౌన్స్ కేసులో దోషి హెచ్‌సీ గురు ప్రసాద్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఏడీజే కే.వెంకటరమణారెడ్డి బుధవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. బళ్లారికి చెందిన హెచ్‌సీ గురుప్రసాద్‌ గుంతకల్లుకు చెందిన నూర్‌ మహ్మద్‌ల మధ్య వ్యాపార లావాదేవీలున్నాయి. నూర్‌ మహ్మద్‌కు గురుప్రసాద్‌ ఏడున్నర లక్షలు బాకీ పడ్డాడు. బాకీ తీర్చడం కోసం నూర్‌మహ్మద్‌కు గురుప్రసాద్‌ చెక్‌ ఇచ్చాడు. అయితే ఆ చెక్‌ బౌ¯Œ్స అయింది. దీంతో నూర్‌మహ్మద్‌ గుంతకల్లు పోలీసు స్టేష¯ŒSలో కేసు పెట్టాడు. పలు విచారణల అనంతరం కేసు బుధవారం తుది విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో గురు ప్రసాద్‌కు ఏడాది శిక్షతో పాటు ఏడున్నర లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని  ఏడీజే తీర్పు చెప్పారు. ప్రాసిక్యూష¯ŒS తరఫున ఎంవీ మహేష్‌కుమార్‌ వాదించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement