కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో మంగళవారం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో ఓ వ్యక్తి చనిపోయాడు.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో మంగళవారం ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో ఓ వ్యక్తి చనిపోయాడు. గ్రామానికి చెందిన ఎం.బాషా(27) తన ఇంట్లో మోటారు ఆన్ చేశాడు. అది పని చేయకోవటంతో మరమ్మతు చేయబోయాడు. అందులో విద్యుత్ ప్రసారం అవుతుండటంతో షాక్తో అక్కడికక్కడే చనిపోయాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు.